
విపత్తులు ఎదుర్కొనేలా మాక్డ్రిల్
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి జిల్లా స్థాయి టేబుల్ టాప్ అభ్యాసం, మాక్డ్రిల్ను బుధవారం ఏడీఎం, ఫాల్గుణీ మఝి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటరు సుభోధ్ నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా ఎమర్జెన్సీ అధికారి జగన్నాఽథ్ పాఢి, ప్రజా ఆరోగ్యశాఖ అసిస్టెంటు ఇంజినీరు బిష్ణుప్రసాద్ అగర్వాల్, అసిస్టెంటు సెక్షన్ ఆఫీసర్ (ఫైర్) అమితాబ్ రాజ్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో విపత్కర సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ఏడీఎం మఝి అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక బృందంగా ఏర్పడి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా బరంపురం నుంచి వచ్చిన ఓడ్రాఫ్ సిబ్బంది, జిలా అగ్నిమాపక దళం మాక్ డ్రిల్ నిర్వహించారు. తుఫాను, వరదలు వచ్చినప్పుడు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్లు తొలగించడానికి కట్టర్లు, అస్కా విద్యుత్ లాంతర్లు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఆక్సిజన్ సిలెండర్లు, జనరేటర్లు ఉపయోగించి ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలో అగ్నిమాపక దళం మ్యాక్ డ్రిల్ చేశారు.

విపత్తులు ఎదుర్కొనేలా మాక్డ్రిల్

విపత్తులు ఎదుర్కొనేలా మాక్డ్రిల్

విపత్తులు ఎదుర్కొనేలా మాక్డ్రిల్

విపత్తులు ఎదుర్కొనేలా మాక్డ్రిల్