
తెంతులకుంటి సమితిలో ఎమ్మెల్యే పర్యటన
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితిలో బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తొలిసారిగా బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి తెంతుల కుంటి సమితి కేంద్రాన్ని సందర్శించారు. బీజేపీ కార్యాకర్తలు మేళతాళాలతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. బీజేడీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ సమితి గత ఎన్నికల్లో బీజేపీకి చిక్కింది. బీజేడీ కి చెందిన సమితి చైర్మన్ నీలాద్రి నాయక్ అవిశ్వాస తీర్మానంతో దించాలని సొంత పార్టీ నిర్ణయించింది. దీంతో ఆమె బీజేపీని ఆశ్రయించింది. కేవలం బీజేపీ ఆ సమితిలో ముగ్గురు సమితి సభ్యులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ బీజేపీ లౌక్యంతో మరికొందరు మద్దతు పలికారు. తద్వారా అవిశ్వాస తీర్మానానికి సరిపడా కోరం లేక వీగిపోయింది. చివరకు చైర్మన్ నీలాద్రి మజ్జి బయట పడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే తెంతుల కుంటి సమితికి ఆహ్వానించి విజయోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంజ దాస్, సీనియర్ నాయకులు కను దాస్, దేవదాస్ మహాంకుడో పాల్గొన్నారు.

తెంతులకుంటి సమితిలో ఎమ్మెల్యే పర్యటన