అత్యాచార నిందితుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అత్యాచార నిందితుడు అరెస్టు

Jun 18 2025 7:26 AM | Updated on Jun 18 2025 7:26 AM

అత్యాచార నిందితుడు అరెస్టు

అత్యాచార నిందితుడు అరెస్టు

జయపురం: బాలికను అపహరించి అత్యాచారం చేసిన నేరంపై ఒక వ్యక్తిని జయపురం సదర్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు సదర్‌ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. అరైస్టెన వ్యక్తి కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌ సమితి కక్కిరిగుమ్మ పంచాయతీ తునాపొదర్‌ గ్రామానికి చెందిన రాజ కందపాన్‌ ఉరఫ్‌ టుకులు, ఉరఫ్‌ ముకుంద అని పేర్కొన్నారు. అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని బెయిలు మంజూరవ్వకపోవడంతో జైలుకు తరలించామన్నారు. వివరాల్లోకి వెళ్తే.. జయపురానికి చెందిన ఒక మైనర్‌ బాలిక 2024లో ఒక వివాహ విందుకు వెళ్లింది. అక్కడ ఆమెకు రాజకంద పాల్‌ పరిచయమయ్యాడు. అప్పటినుంచి వారిరువురు ఫోనులో మాట్లాడుకోవటం ప్రారంభమయింది. అయితే ఈ ఏడాది మార్చి రెండో వారంలో రాజకందపాన్‌ ఆ బాలికను అపహరించి తీసుకెళ్లిపోయాడు. మైనర్‌ బాలికను అతడు కేరళ తీసుకెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు గత ఏప్రిల్‌ 3వ తేదీన మైనర్‌ బాలికను కనుగొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్పుడు పరారైన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement