
20న ప్రెస్ యూనియన్ వార్షికోత్సవం
రాయగడ: ఈ నెల 20వ తేదీన ప్రెస్ యూనియన్ తొమ్మిదో వార్షికోత్సవం జరగనుంది. స్థానిక బిజూపట్నాయక్ ఆడిటోరియంలో జరగనున్న కార్యక్రమానికి కదాంబిని మాస పత్రిక సంపాదకురాలు డాక్టర్ ఇతిరాణి సామంత ముఖ్యఅతిథిగా, కొరాపుట్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిఖిల్ కుమార్ గౌడ ముఖ్యవక్తగా, గౌరవఅతిథిగా అఖిల భారతీయ సాంత సమితి అధ్యక్షులు దండి స్వామి భాస్కర తీర్థలు హాజరుకానున్నట్లు యూనియన్ అధ్యక్షులు అమూల్య రత్న సాహు ,కార్యదర్శి శివాజీ దాస్లు మంగళవారం తెలిపారు. వార్షికోత్సవంలో పాల్గొనాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.