
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి వేంకటేశ్వర స్వామివారి దేవాలయం 16వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడికి జిల్లాలో ఒకే ఒక్క దేవాలయం ఉంది. దీనిలో భాగంగా దేవాలయం నుంచి పుర వీధుల వెంబడి పల్లకి సేవ జరిగింది. అలాగే సాయంత్రం కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4 వేల మందికి ఉచిత అన్నప్రసాద సేవనం జరిగింది. మున్సిపల్ చైర్మన్ కును నాయక్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె.ధనుంజయ్ పట్నాయక్, సభ్యులు ఎన్.రవిరెడ్డి, టి.నందికేశ్వరరావు, పసుమర్తి ఆనందరావు, జి.చంద్రశేఖర్, నాగేశ్వర్ షావుకారు పాల్గొన్నారు.