
ఆకర్షించిన సైకత మొసళ్లు
రాష్ట్రంలో మొసళ్ల సంతతి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు క్రోకోడైల్ ఇన్ ఒడిశా కార్యక్రమం చేపట్టి మంగళవారం నాటికి 50 ఏళ్లు పూర్తయింది. మరో వైపు ప్రపంచ మొసళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పూరీ సాగర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత మొసళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. –భువనేశ్వర్/పూరీ
స్వచ్ఛంద రక్తదాన శిబిరం
జయపురం: సంబాద్–అమొ ఒడిశా ద్వారా స్థానిక అగ్రసేన్ భవనంలో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జయపురం రక్త బండార్ అధికారి డాక్టర్ సూర్య శేఖర మిశ్ర ముఖ్యఅతిధిగా శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వక్తలు రక్తదాతలకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిది యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జయపురం రక్త బండార్ టెక్నీషియన్ అజయ కుమార్ పండ, నితినియాల్ ధాని, బి.ప్రతిభ పాత్రో తదితరుల దాతల నుండి రక్తం సేకరించారు. శిబిరంలో సంబాద్ –అమొ ఒడిశా జయపురం ప్రతినిధి తరుణ కుమార్ పాత్రో, అశోక్ కుమార్ పోలాయ్లతో పాటు సమాజ సేవి అరుణ జైన్, సంజయ్ జైన్, జయపురం సబ్డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో, హరిప్రియ బిశాయి,మహమ్మద్ రసూల్, శైలజ హత్త, పి.ఆనంద, రాధాకాంత దాస్, వి.సత్యనారాయణ సెట్టి, పవణ దాస్ పాల్గొన్నారు.
ఉరి వేసుకొని
వ్యక్తి ఆత్మహత్య
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి నీలాకాంబేర్ పంచాయతీకి చెందిన శైలేంద్ర మహంతి(55) అనే వ్యక్తి సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శైలేంద్ర బలిమెల డిగ్రీ కాలేజీలో ప్యూన్గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 8.30 గంటల సమయంలో చిన్న కొడుకు ఇంటికి వచ్చి తలుపు తీయగా తండ్రి ఉరికి వేలాడుతూ కన్పించాడు. దీంతో వెంటనే స్థానికుల సాయంతో బలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బలిమెల ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పాముకాటుతో
యువకుడు మృతి
రాయగడ: పాముకాటుతో యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని గుడారి సమితి పెండిలి గ్రామ పంచాయతీ దుప్పులపాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు వీరేంద్ర కుమార్ సొబొరొ (16)గా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరేంద్ర కుమార్ గ్రామ సమీపంలోని పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పాముకాటు వేసింది. దీంతో కుటుంబీకులు అతనిని వెంటనే హస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్లో గల బొడొవీధిలో నివసిస్తున్న వేలధర్ కౌసల్య (15) పాము కాటుతో మృతి చెందాడు. సోమవారం రాత్రి అంతా భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో పాము వేలధర్ పొట్ట వద్ద కాటు వేసింది. పిల్లాడు నొప్పితో బాధ పడుతుండడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వేలధర్ మంగళవారం మృతి చెందాడు.

ఆకర్షించిన సైకత మొసళ్లు

ఆకర్షించిన సైకత మొసళ్లు

ఆకర్షించిన సైకత మొసళ్లు