డ్రైవర్ల సమస్యలపై ఎస్పీకి వినతి | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్ల సమస్యలపై ఎస్పీకి వినతి

Jun 18 2025 7:26 AM | Updated on Jun 18 2025 7:26 AM

డ్రైవర్ల సమస్యలపై  ఎస్పీకి వినతి

డ్రైవర్ల సమస్యలపై ఎస్పీకి వినతి

రాయగడ: విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వివిధ వాహనాల డ్రైవర్లు కోరారు. ఈ మేరకు ఎస్పీ స్వాతి ఎస్‌ కుమార్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఒడిశా డ్రైవర్ల మహాసంఘం రాయగడ శాఖకు చెందిన డ్రైవర్లు ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఒడిశా మెటార్‌ ట్రాన్స్‌స్పొర్ట్‌ డ్రైవరు అండ్‌ వర్కర్స్‌ సంక్షేమ బోర్డులో డ్రైవర్‌ను సభ్యునిగా చేర్పించాలన్నారు. అలాగే డ్రైవర్లపై జరుగుతున్న దాడులపై జిల్లా పోలీస్‌ యంత్రాంగం స్పందించి తగు రక్షణ కల్పించాలని వివరించారు. డ్రైవరుగా విధులు నిర్వహించి 60 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ పింఛన్‌ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. పార్కింగ్‌ చేసేందుకు నిర్ధిష్టమైన స్థలాన్ని పట్టణంలోని ప్రతీ ప్రాంతంలో ఏర్పాటు చేయా లని కోరారు. ఒడిశా డ్రైవర్ల మహాసంఘం కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్‌ తురక్‌ నేతృత్వంలో డ్రైవర్లు ఈ మేరకు ఎస్పీకి విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement