
వైద్యుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిపై దాడి జరిగింది. దాడికి గురైన వైద్యుడు సోపన్కుమార్ డిండా తెలిపిన వివరాల మేరకు.. బాలిక ఊయల ఊగుతూ పడిపోయిందని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వచ్చారని, ఆదివారంం సాయంత్రం 5 గంటల సమయంలో సిబ్బంది క్యాజువాలిటీలో చేర్చుకున్నారని, తాను ఆ సమయంలో 4వ అంతస్తులో ఉన్నానని, కిందకు వచ్చి చూస్తే బాలిక తల నుంచి రక్త స్రావం అవుతున్నట్లు గమనించానని చెప్పారు. వారికి చెబుతుండగానే బయట ఊరికి తీసుకుపోతామని చెప్పారని, ఓ ప్రైవేటు వాహనంలో తిరిగి 6.30కు ఇక్కడకు తెచ్చారని, బాలికకు చికిత్స చేస్తుండగా 7.15కు మృతి చెందిందని తెలిపారు. దీనిపై బాలిక తండ్రికి వివరిస్తుండగా ఆయన స్నేహితులు దాడికి దిగారని తెలిపారు. మంగళవారం మళ్లీ ఆస్పత్రికి మీదకు వచ్చారని పోలీసులను ఆశ్రయించారు. మల్కన్గిరి ఐఐసి రీగాన్ కీండో కేసు నమోదు చేశారు.