జలాశయాల్లో మృత్యు ఘోష | - | Sakshi
Sakshi News home page

జలాశయాల్లో మృత్యు ఘోష

Jun 18 2025 3:13 AM | Updated on Jun 18 2025 3:13 AM

జలాశయ

జలాశయాల్లో మృత్యు ఘోష

మూడు రోజుల్లో ఐదుగురు బలి

ఇంకా లభ్యం కాని బెంగళూరు

ఇంజినీర్‌ ఆచూకీ

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లాలో జలాశయాలు కోరలు చాస్తున్నాయి. వరుసగా మూడు రోజుల్లో మూడు వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు బలయ్యారు. కొరాపుట్‌ జిల్లా కొట్‌పాడ్‌ సమితి ముర్తా హండి గ్రామ పంచాయతీలో ప్రఖ్యాత గులిమి జల పాతంలో ఇద్దరు బాలలు గల్లంతయ్యారు. నబరంగ్‌పూర్‌ జిల్లా కొసాగుమ్మడ సమితికి చెందిన కిరణ్‌ మిర్గాన్‌ (16), అలోక్‌ రాజ సునా (16)లు మరో ఆరుగురు మిత్రులతో కలసి గులిమి వెళ్లారు. అక్కడ రీల్స్‌ తీస్తూ జలపాతంలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన మిగతా మిత్రులు పెద్దలకు సమాచారం ఇచ్చారు. వెంటనే కొట్‌పాడ్‌ నుంచి అగ్ని మాపక,ఓడ్రాఫ్‌ దళాలు వెళ్లి జలాశయం లో గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. మరో వైపు ఇదే జిల్లా లమ్తాపుట్‌ సమితి మాచ్‌ఖండ్‌ డుడుమా జల పాతం వద్ద గల్లంతైన బెంగళూరు యువ ఇంజినీర్‌ అన్వేస్‌ దాస్‌ (27) గల్లంతై మూడు రోజులు గడుస్తున్నప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం నందపూర్‌ సమితి జోలాపుట్‌ డ్యామ్‌లో ఇద్దరు మైనర్లు ప్రమాదవశత్తు పడి మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. ఈ మూడు ప్రమాదాల బారిన పడ్డ వారందరూ ఆ ప్రాంతం లో నీటి అంచనా తెలియక బలైన వారే కావడం విశేషం.

జలాశయాల్లో మృత్యు ఘోష1
1/2

జలాశయాల్లో మృత్యు ఘోష

జలాశయాల్లో మృత్యు ఘోష2
2/2

జలాశయాల్లో మృత్యు ఘోష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement