భూగర్భంలో దొరికిన రాముడి ప్రతిమ | - | Sakshi
Sakshi News home page

భూగర్భంలో దొరికిన రాముడి ప్రతిమ

Apr 7 2025 12:24 AM | Updated on Apr 7 2025 12:24 AM

భూగర్భంలో దొరికిన రాముడి ప్రతిమ

భూగర్భంలో దొరికిన రాముడి ప్రతిమ

భువనేశ్వర్‌: భూగర్భంలో శ్రీరాముని కాంస్య విగ్రహం బయటపడింది. ఈ సంఘటనతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. కటక్‌ జిల్లా బంకి మండలం రొత్తాగొడొ గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన బలరామ్‌ రౌత్‌ వివరించిన కథనం ప్రకారం శుక్రవారం రాత్రి అతనికి రల వచ్చింది. ఆ ప్రకారం అతను తన కలలో చూసిన ప్రదేశంలో శనివారం తవ్వి వెతకడంతో విగ్రహం బయటపడింది. ఈ వెలికితీతలో అతనికి రాముడి కాంస్య విగ్రహం కనిపించింది. ఈ సమాచారం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. స్థానికులు రామ నవమి సందర్భంగా భగవంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రణాళిక వేశారు. ప్రతిమ దొరికిన ప్రదేశం యజమాని దిబాకర్‌ మల్లిక్‌ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement