ఆర్టీసీ ఎండీని కలిసిన ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎండీని కలిసిన ఉద్యోగులు

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

ఆర్టీసీ ఎండీని కలిసిన ఉద్యోగులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ ఎండీగా పనిచేస్తూ, ఆర్టీసీ ఎండీగా నియమితులైన కె. శేషుకుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు, ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. రోడ్లు భవనాలు శాఖలో ఎన్నో ఉన్నతమైన నిర్ణయాలతో పనిచేసిన శేషుకుమార్‌, ఆర్టీసీ ఎండీగా మరింత సమర్థనీయమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆర్టీసీ ఎండీని కలిసిన వారిలో ఆ సంఘ సిటీ ప్రెసిడెంట్‌ కేఎస్‌ఎన్‌ రవీంధ్రకుమార్‌, సంఘ సభ్యులు ఉన్నారు. దుర్గగుడిలో నేడు సామూహిక అక్షరాభ్యాసాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై బుధవారం సామూహిక అక్షరాభ్యాసాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహామండపంలోని ఆరో అంతస్తులో ఉదయం 8.06 గంటలకు అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అక్షరాభ్యాసం చేయించుకునే చిన్నారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కావడంతో వారందరూ తప్పని సరిగా ఉదయం 6 గంటల కల్లా ఆలయానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తల్లిదండ్రులు వారి పత్రాలను చూపి ఆరో అంతస్తులోకి ప్రవేశించాలని, చిన్నారితో పాటు తల్లిదండ్రులను మాత్రమే పూజా మండపంలోకి అనుమతిస్తామన్నారు. అక్షరాభ్యాసం చేసుకునే చిన్నారులందరికీ పలక, బలపంతో పాటు పూజా సామగ్రిని అందజేస్తామని తెలిపారు. కార్యక్రమం అనంతరం రూ. 300 క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. నాట్యాచార్యుడు అజయ్‌ శ్రీనివాస్‌కి ‘యువ’ పురస్కారం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

విజయవాడ కల్చరల్‌: నగరానికి చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు శ్రీనివాస్‌ అజయ్‌ చక్రవర్తికి 2024 సంవత్సరానికి గానూ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారం లభించినట్లు శ్రీనివాస చక్రవర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘకాలం కూచిపూడి సంప్రదాయ నృత్యాన్ని దేశ విదేశాలలో ప్రదర్శించి వందలాది మందికి శిక్షణ ఇచ్చినందుకుగానూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌కు ఎంపిక చేసింది. తల్లిదండ్రుల పెదప్రోలు జేజిబాబు, తల్లి శారద ప్రోత్సాహంతో ప్రముఖ నాట్యాచారిణి లంకా అన్నపూర్ణ నృత్యంలో ఓనమాలు నేర్చుకోగా.. కూచిపూడి నాట్యాన్ని నాట్యాచార్యులు వెంపటి చినసత్యం, వేదాంతం రాధేశ్యాం, వేదాంతం వెంకటా చలపతి వద్ద నేర్చుకున్నారు. అజయ్‌ చక్రవర్తి నృత్యరూపకాలలో ప్రతినాయక పాత్రలు, మహిషాసురుడు, రావణ బ్రహ్మ, ఘటోత్కచుడు, హిరణ్య కశ్యపుడు తదితర పాత్రాలలో నటించి రక్తికట్టించారు.

మచిలీపట్నంఅర్బన్‌: ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీని కోరారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్‌ పీఎఫ్‌ ఖాతాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌ పియర్‌ స్లిప్‌లను విడుదల చేయాలని కోరారు. మచిలీపట్నం, గుడివాడ స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సీఎస్‌ఎస్‌ పథకంలో జమ చేసిన డీఏ, వేతన సవరణ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి త్వరితగతిన పరిష్కరించాలని కోరా రు. ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డి. చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు పి. ఇమ్మానియేల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి యూవీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement