రక్తదానం ప్రాణదానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానంతో సమానం

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

రక్తదానం ప్రాణదానంతో సమానం మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎన్టీఆర్‌ జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కొల్లేటి రమేష్‌ అన్నారు. సత్యనారాయణపురం రైల్వేకాలనీ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహకారంతో రక్తదాతల దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మదన్‌మోహన్‌, రైల్వే ట్రైనింగ్‌ అకాడమీ ప్రిన్సిపాల్‌ శాంతారాం సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ కార్యవర్గం ఏకగ్రీవం ఉంగుటూరు(గన్నవరం): వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా పి.పవన్‌కుమార్‌, శీలం నారాయణ ఎన్నికయ్యారు. మండల కేంద్రం ఉంగుటూరులో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఆఫీస్‌ బేరర్లుగా అజ్మీరా వెంకటేశ్వరరావు, మహమ్మద్‌ అబ్దుల్‌ బారి, మల్లంపల్లి ఆంజనేయులు, పోసిన మోహన్‌రావు, మరో 21 మంది జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. భూమిలేని పేదలకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి, మూడు సెంట్ల ఇంటి స్థలం పంపిణీ చేయాలని, పక్కా గృహ నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేయాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. 17న జాబ్‌ మేళా యూరో–ఆంకాలజీ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు

పామర్రు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు కురుమద్దాలిలోని రూరల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూఎన్‌వో మిండా లిమిటెడ్‌, జోయాలూక్కాస్‌, కురాకు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, అడెక్కో ఇండియా లిమిటెడ్‌, వరుణ్‌ మోటార్స్‌, అపోలో ఫార్మసీ, క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ లిమిటెడ్‌, మోహన్‌ స్పింటెక్స్‌, పేటీఎం సర్వీసెస్‌ వంటి 10కి పైగా ప్రముఖ కంపెనీల పాల్గొంటాయని వివరించారు. టెన్త్‌, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీ ఫార్మసీ, పూర్తిచేసిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని పేర్కొన్నారు. అర్హులు ముందుగా హెచ్‌టీటీపీఎస్‌://ఎన్‌ఏఐపీయుఎన్‌వైఏఎం.ఏపీ.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు.

లబ్బీపేట(విజయవాడ తూర్పు): యూరో– ఆంకాలజీ రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న విప్లవాత్మక వైద్య, సాంకేతిక పరిణామాలు క్యాన్సర్‌ చికిత్సల్లో నూతన మార్పులకు దారి తీస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. మూత్రపిండాలు, ప్రొస్టేట్‌, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్‌ శస్త్రచికిత్సలు, ఆధారబద్ధమైన వైద్య నిర్ణయాలు, క్లిష్ట శస్త్రచికిత్స నైపుణ్యాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో ‘యూరో–ఆంకాలజీ సింప్లిఫైడ్‌ – 2026’ పేరుతో రాష్ట్రస్థాయి శాసీ్త్రయ సదస్సు విజయవాడలో ఆదివారం జరిగింది. సొసైటీ ఆఫ్‌ జెనిటో యూరినరీ సర్జన్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (సోగస్‌–ఏపీ) ఆధ్వర్యంలో, విజయవాడ అసోసియేషన్‌ ఆఫ్‌ జెనిటో యూరినరీ సర్జన్స్‌ (వేగస్‌) సహకారంతో జరిగిన ఈ సదస్సుకు 200 మందికి పైగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు, యువ వైద్యులు, పీజీ విద్యార్థులు హాజరై యూరో–ఆంకాలజీ రంగంలో తాజా వైద్య విధానాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సులో ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎం.వి.కృష్ణకిషోర్‌, వేగస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ పి.శ్రీమన్నారాయణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ కె.ప్రియతమ్‌, డాక్టర్‌ ధీరజ్‌, పేట్రాన్‌ డాక్టర్‌ కె.ప్రశాంత్‌కుమార్‌ విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement