నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది ఎంపికయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా నలుగురు మాత్రమే ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా నుంచి 119 మంది, ఎన్టీఆర్ జిల్లా నుంచి 66 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
డాక్టర్ కేవీఎల్ఎన్ శర్మకు మహా నంది పురస్కారం
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ అయోధ్యనగర్కు చెందిన ప్రముఖ రచయిత, పద్య నాటక కళాకారుడు డాక్టర్ కంచర్ల వేంకటలక్ష్మీనరసింహ శర్మ (కేవీఎల్ఎన్ శర్మ)కు నంది పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు వెలుగు సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో శనివారం వరంగల్ టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన తెలుగు వెలుగు పురస్కారాల మహోత్సవంలో డాక్టర్ శర్మను సత్క రించి మహా నంది పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘లవంగి’ పుస్తకానికిగాను 2017లో ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్, ‘జగన్నాథ పండిత రాయలు’ పుస్తకానికిగాను అదే సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ మరో డాక్టరేట్ ప్రదానం చేయడం ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. డాక్టర్ శర్మకు మహా నంది పురస్కారం లభించడంపట్ల పలువురు సాహితీవేత్తలు అభినందించారు.


