ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలి

Jun 22 2025 3:30 AM | Updated on Jun 22 2025 3:30 AM

ప్రతి

ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలి

కృష్ణా కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని కలెక్టరేట్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణంలో సమతుల్యత జరగాలంటే పచ్చదనం పెంపుదల చేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ వారి ఇంటి ఆవరణలో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో కె.స్వాతి, కలెక్టరేట్‌ ఏవో సీహెచ్‌ వీరాంజనేయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్‌ డీఎస్‌సీగా షణ్ముగ వడివేల్‌ బాధ్యతల స్వీకారం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డీఎస్‌సీ (డివిజినల్‌ సెక్యూరిటీ కమిషనర్‌)గా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) 2014 బ్యాచ్‌కు చెందిన షణ్ముగ వడివేల్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడుకు చెందిన ఆయన ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. అనంతరం 2014లో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తొమ్మిది సంవత్సరాల తన కెరీర్‌లో భారతీయ రైల్వేలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈశాన్య సరిహద్దు రైల్వేలోని టిన్సుకియా డివిజన్‌లో డీఎస్‌సీగా, ఉత్తర రైల్వేలోని మొరాదాబాద్‌ డివిజన్‌లో సీనియర్‌ డీఎస్‌సీగా, దక్షిణ రైల్వేలోని చైన్నె డివిజన్‌లో సెక్యూరిటీ కమిషనర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డీఎస్‌సీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్‌పీఎఫ్‌ అధికారులు, పలు బ్రాంచ్‌ల అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.

వీఎంసీ సబార్టినేటర్స్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

పటమట(విజయవాడతూర్పు):విజయవాడ నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆఫీస్‌ సబార్డినేటర్స్‌ కార్యవర్గ ఎన్నిక శనివారం జరిగింది. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలు వద్ద జరిగిన ఈ ఎన్నికల్లో శీలం కరుణ అధ్యక్షులుగా ఎన్నికర్యారు. ఉపాధ్యక్షులుగా పీవీ లోకేశ్వరరావు, కార్యదర్శిగా పీవీ ఆనంద్‌ హనుమాన్‌, సహాయ కార్యదర్శిగా డి. దుర్గమ్మ, కోశాధికారిగా కె. ఫణి భరత్‌ ఎన్నికయ్యారు.

ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలి 1
1/1

ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement