
ఆర్టీసీ ప్రయాణికుల అగచాట్లు
ఆటోనగర్(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులను విశాఖపట్నానికి మళ్లించడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా సిటీ, లైన్ సర్వీసులు సరిపడా రాకపోవడంతో ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. నిత్యం మచిలీపట్నం,పామర్రు, ఉయ్యూరు, కంకిపాడుతోపాటు పలు గ్రామాల నుంచి పనులకు వస్తుంటారు. కేవలం నాన్స్టాప్ బస్సులను మాత్రమే ఆర్టీసీ అధికారులు నడపడంతో మిగతా గ్రామాల నుంచి విజయవాడకు ప్రయాణికులు రావడానికి నానా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ఆటోనగర్ బస్టెర్మినల్ వద్ద వివిధ గ్రామాలకు వెళ్లడానికి ప్రయాణికులు నిలువ కాళ్లపై ఎదురు చూడాల్సి వచ్చింది. గంటకు ఒక బస్సో... గంటన్నరకు మరొక సిటీ బస్సు రావడంపై ఇంటికి ఎలా వెళ్లాలో అర్థంకాక తలపట్టుకున్నారు. మచిలీపట్నం. గుడివాడ, కై కలూరు, భీమవరానికి మాత్రమే నాన్స్టాప్ బస్సులను అరకొరగానే నడిపారు.
రెండో రోజూ అరకొర బస్సులతో సరి