తొలిదశలో గుర్తిస్తే మందులతోనే నయం | - | Sakshi
Sakshi News home page

తొలిదశలో గుర్తిస్తే మందులతోనే నయం

Jun 19 2025 7:48 AM | Updated on Jun 19 2025 7:48 AM

తొలిద

తొలిదశలో గుర్తిస్తే మందులతోనే నయం

శరీరంలో వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేసే ఇన్‌బిల్ట్‌ మిషన్లు కిడ్నీలు. వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అశ్రద్ధ వహిస్తే అసలుకే ఎసరు తెస్తుంది. నేటి సమాజంలో ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, రసాయనాలు వాడిన పండ్లు, ఇతర ఆహార పదార్ధాలు, అతిగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడకం కిడ్నీలకు ప్రధాన శత్రువులు. వీటిని పరిహరిస్తే మన కిడ్నీలు సురక్షితంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకులు పరుగుల జీవనం... ఆధునిక జీవనశైలి కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఎ.కొండూరు ప్రాంతంలోనే కాక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధుల బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శరీరంలో అత్యంత కీలకమైన సూపర్‌ ఆర్గాన్స్‌గా పిలిచే కిడ్నీల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. అదుపులేని మధుమేహం, అధిక బరువు, ఆహారంలో పెస్టిసైడ్స్‌ అవశేషాలు వంటి వాటితో కిడ్నీలకు హాని కలుగుతుంది. కిడ్నీలు 2/3 వంతు డ్యామేజీ అయ్యేంత వరకూ గుర్తించలేక పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు, వ్యాధులను ముందుగా గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు తరచూ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

జీవనశైలితో జిల్లాలో పెరిగిన కిడ్నీ వ్యాధులు ఆహారంలో పెస్టిసైడ్స్‌ అవశేషాలతో కిడ్నీలపై ప్రభావం తరచూ నొప్పి నివారణ మందులు వాడడం ఒక కారణమే ముందస్తు చర్యలతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు

తొలిదశలో గుర్తిస్తే మందులతోనే నయం1
1/1

తొలిదశలో గుర్తిస్తే మందులతోనే నయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement