పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా శివరామప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా శివరామప్రసాద్‌

Jun 19 2025 7:48 AM | Updated on Jun 19 2025 7:48 AM

పౌరసర

పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా శివరామప్రసాద్‌

చిలకలపూడి(మచిలీపట్నం): పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా టి.శివరామప్రసాద్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా మేనేజర్‌గా పనిచేసిన శిరీష బదిలీ అయ్యారు. ఆ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌గా పని చేస్తున్న శివరామప్రసాద్‌ను కృష్ణాజిల్లాకు నియమించారు. ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ డీకే బాలాజీ, జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

దుర్గమ్మ సేవలో కేంద్ర సాధికార కమిటీ సభ్యులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర సాధికార కమిటీ సభ్యులు, శాసనసభ ఉప సభాపతి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌ గోయల్‌, జెఆర్‌.భట్‌, సునీల్‌ లిమాయేలను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కేంద్ర సాధికార కమిటీతో పాటు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కమిటీ సభ్యులతో పాటు అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా శివరామప్రసాద్‌ 1
1/1

పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా శివరామప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement