29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం | - | Sakshi
Sakshi News home page

29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం

Jun 19 2025 7:48 AM | Updated on Jun 19 2025 7:48 AM

29న ద

29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఈ నెల 29వ తేదీన తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ శ్రీభాగ్య నగర్‌ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బుధవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. తొలుత ఆలయ దుర్గగుడి ఈవో శీనానాయక్‌ను కలిసి ఉత్సవం నిర్వహణ గురించి వివరించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది 29న సుమారు 500 మందితో అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నట్లు కమిటీ అధ్యక్షుడు జి.రాఘవేందర్‌ తెలిపారు. 29వ తేదీ ఉదయం హైదరాబాద్‌ నుంచి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు దుర్గగుడి దేవస్థానం తరఫున జూలై 18న అమ్మవార్లకు సారె సమర్పించేందుకు విచ్చేయాలని కోరారు.

జనగణనతో పాటే

కులగణన హర్షణీయం

లబ్బీపేట(విజయవాడతూర్పు): జనగణనతో పాటే కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న గజిట్‌ విడుదల చేయడం హర్షణీయమని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. విజయవాడలోని తమ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో జనగణనతో పాటే కులగణన చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక రూపాల్లో ఉద్యమాలు, నిరసనలు చేసినట్లు తెలిపారు. ఆ ఫలితంగా నేడు కులగణన చేసేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా కచ్చితంగా తెలిసేలా వెనుకబడిన తరగతులకు చెందిన జాతీయ స్థాయిలోని 3,746 కులాలు, రాష్ట్రంలోని 139 కులాలకు చెందిన వారందరూ తమ జనాభా వివరాలతో పాటు కులాల వివరాలు కూడా తెలియజేయాలన్నారు. అప్పుడే బీసీ కులాల జనాభా ఎంత ఉందో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ ఉద్యోగుల విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చెప్పాడ చందు, పునుగుపాటి శ్రీనివాస్‌, నాయకులు వాకా వెంకటేశ్వరరావు, తెన్నేటి సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై రైతులు మొగ్గుచూపాలి

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

కంచికచర్ల: జిల్లాలో 867మంది చిన్న, సన్నకారు రైతులకు రూ.1.67 కోట్ల వ్యవసాయ యాంత్రీ కరణ రాయితీ నిధులు జమ చేసిన చెక్‌ను అందించినట్టు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. కంచికచర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్‌ విజయకుమారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు ఎప్పటి కప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సాగు ఖర్చులు తగ్గించుకుని వ్యవ సాయాన్ని లాభసాటిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సి ఉందన్నారు. అధిక నీటి అవసరం ఉన్న వరి పంటనే కాకుండా, చిరుధాన్యాలు, కూరగాయలు పండ్ల తోటలు సాగుచేసుకుంటే నికర ఆదాయంతో పాటు తెగుళ్ల బెడద తొలగుతుందని, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు తెలియ జేశారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ, ఎంపీడీఓ బీఎం విజయలక్ష్మి, సర్పంచి వేల్పుల సునీత, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెడ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ గరికపాడు సుధాకర్‌, డీఎం ఆగ్రోస్‌ మానస, ఏడీఏ శ్రీని వాసరావు, మండల ఏఓ కె.విజయకుమార్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ వి.మానస పాల్గొన్నారు.

29న దుర్గమ్మకు  తెలంగాణ బంగారుబోనం1
1/2

29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం

29న దుర్గమ్మకు  తెలంగాణ బంగారుబోనం2
2/2

29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement