
చోరీ కేసుల్లో నలుగురు నిందితుల అరెస్టు
గన్నవరం: వేర్వేరు చోరీ కేసుల్లో నలుగురు నిందితులను ఆత్కూరు పోలీసులు మంగళవారం అదుపు లోకి తీసుకుని ఐదు బైక్లు, విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఉంగుటూరు మండలం పొట్టిపాడులో మే నెల మూడో తేదీ తెల్లవారుజామున ఇంటిలో నిద్రిస్తున్న బాణాల సుభాషిణి మెడలోని ఐదు కాసుల బంగారు గొలుసును దొంగలు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ కె.వి.ఎన్.ఎన్. సత్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ దర్యాప్తు చేపట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చోరీకి పాల్పడింది జంగారెడ్డిగూడెం శివారు వేగవరం గ్రామానికి చెందిన పారేపల్లి శేషు, పోలవరపు నాగదుర్గాప్రసాద్, దుగ్గిరాల శివరామకృష్ణగా గుర్తించారు. ప్రధాన నిందితుడు శేషును మంగళ వారం అరెస్టుచేసి, అతని వద్ద బంగారు గొలుసు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు కొవ్వూరులో జరిగిన ఓ చోరీ కేసులో పట్టుబడి జైలులో రిమాండ్లో ఉన్నారు.
మరో ముగ్గురి అరెస్టు
ఇటీవల ఆత్కూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న బైక్ చోరీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఆత్కూరు పోలీసులు పొట్టిపాడు టోల్గేట్ వద్ద బైక్పై వెళ్తున్న ఏలూరుకు చెందిన దత్తి నవీన్, భీమవరానికి చెందిన గుత్తుల రవికుమార్, సాయిశ్రీరామ్ను అనుమానితులుగా గుర్తించి అదుపులో తీసుకున్నారు. పోలీసుల విచార ణలో వారు బైక్ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. పెదపాడు, కై కలూరు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించినట్లుగా ఒప్పుకున్నారు. పోలీసులు వారి వద్ద నాలుగు బైక్లు, బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు ఇప్పటికే పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారు. ఈ కేసులను ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సురేస్ చావా, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.