ఇసుక తవ్వకాల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు

Jun 18 2025 7:22 AM | Updated on Jun 18 2025 7:22 AM

ఇసుక

ఇసుక తవ్వకాల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు

పెనమలూరు: మండలంలోని చోడవరం ఇసుక క్వారీలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో నీరు ఉన్నా కొత్త టెక్నాలజీ సాయంతో పాతాళం నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. 15 అడుగులకు పైగా లోతున ఇసుక తవ్వకాలు జరుగుతుండటంతో భూగర్భ జలాలు పడిపోతాయని స్థానికులు వాపోతున్నారు. గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ నిబంధనల ప్రకారం రుతుపవనాల సమయంలో నదుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. అయితే అక్రమార్కులు చోడవరం క్వారీలో జేసీబీలు, పొక్లెయిన్ల పెద్ద సంఖ్యలో దించి 15 అడుగుల పైగా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టారు.

ఇసుక దోపిడీకి కొత్త విధానం

చోడవరం క్వారీలో భారీ తవ్వకాలతో లారీలు రాకపోకలకు ఆటంకాలు కలుగుతున్నాయి. దీంతో అక్ర మార్కులు కొత్త సాంకేతికతను వాడుతున్నారు. బో ట్ల తీసుకొచ్చి, వాటికి యంత్రాలు అమర్చి పైపుల ద్వారా నీటి అడుగు నుంచి ఇసుక తవ్వకాలను మొదలు పెట్టారు. నదిలో నీటి అడుగున ఉన్న ఇసుకను పైపుల ద్వారా తోడుతున్నారు. పైపుల నుంచి ఇసుక నేరుగా వచ్చి గట్టుపై పడుతోంది. బోట్లు, యంత్రాలతో రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గట్లపై పడిన ఇసుకను పొక్లెయిన్లతో లారీల్లో లోడుచేసి తరలిస్తున్నారు.

చోడవరం ఇసుక క్వారీలో

కొత్త టెక్నాలజీ వినియోగం

బోట్లతో 15 అడుగులకు పైగా

లోతుగా తవ్వకాలు

గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ నిబంధనలు

పట్టించుకోని మాఫియా

ఇసుక తవ్వకాల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు 1
1/2

ఇసుక తవ్వకాల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు

ఇసుక తవ్వకాల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు 2
2/2

ఇసుక తవ్వకాల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement