
యుద్ధం నశించాలి, ప్రపంచ శాంతి నెలకొనాలి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
కృష్ణలంక (విజయవాడ తూర్పు): యుద్ధం నశించి ప్రపంచ శాంతి నెలకొనా లని, స్వేచ్ఛాయుత పాలస్తీనా ఏర్పడాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆకాంక్షించారు. విజయ వాడలో మంగళవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ అధ్యక్షతన ‘యుద్ధం వద్దు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న లక్ష్మణరావు మాట్లా డుతూ.. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మానవీయ సంక్షోభమని అన్నారు. ఇప్పటికే పాలస్తీనాలోని అనేక కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయి దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలకు ఉసిగొల్పి అమెరికా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోందన్నారు. పాలస్తీనా ప్రజలు తమ సొంత భూమిపై స్వాతంత్య్రంతో, గౌర వంతో జీవించే హక్కును కోరుతున్నారని తెలిపారు.
బైక్పై విన్యాసాలు.. యువకుడిపై కేసు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన మోహన్ప్రసాద్, ఉయ్యాల సురేష్ ఇద్దరు స్నేహితులు. మోహన్ప్రసాద్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఓ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని బైక్ను కొన్ని రోజుల క్రితం సురేష్ తీసుకెళ్లి వెనుక మరో యువకుడిని ఎక్కించుకుని అర్ధరాత్రి కృష్ణలంక జాతీయ రహదారిపై విన్యా సాలు చేశాడు. బైక్ ముందు చక్రాన్ని పైకి లేపి వెనుక చక్రంపై నడిపిస్తూ విన్యాసాలు చేసి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. వాటిని ఎవరో ప్రయాణికులు వీడియో తీసి ఇన్స్టా గ్రామ్లో పోస్ట్చేశారు. ఆ విన్యాసాలను ఇన్స్టా గ్రామ్లో ఈ నెల 15న మోహన్ప్రసాద్ చూశాడు. తన బైక్తోనే విన్యాసాలు చేశాడని గుర్తించాడు. గంటలో తీసుకొస్తానని చెప్పి తన బైక్ను తీసుకెళ్లి అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మోహన్ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
ట్రాక్టర్ డ్రైవర్ అనుమానాస్పద మృతి
గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరం శివారు పసుభొట్లపాలెంలో ట్రాక్టర్ డ్రైవర్ రేమల్లి వెంకట్రావు(45) అలియాస్ ముసలోడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శత్రువుల చేతి లో వెంకట్రావు హత్యకు గురయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం గ్రామంలోని రోడ్డు పక్కన గాయాలతో వెంకట్రావు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుడ్లవల్లేరు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు చేపట్టే పనిలో ఉండగా, గుడివాడ డీఎస్పీ దీరజ్ వినీల్ పరిస్థితిని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమేశ్వరరావు, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతు డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి బంధువులను వైఎస్సార్ సీపీ నాయకులు మండలి హనుమంతరావు, నాగు, రాజు, ప్రసాద్ పరామర్శించారు.

యుద్ధం నశించాలి, ప్రపంచ శాంతి నెలకొనాలి

యుద్ధం నశించాలి, ప్రపంచ శాంతి నెలకొనాలి

యుద్ధం నశించాలి, ప్రపంచ శాంతి నెలకొనాలి