
యోగాసనాలతో నూతనోత్సాహం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాసనాలతో ప్రతి ఒక్కరూ నూతనోత్సహం పొందొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్టీఎస్రోడ్డులోని యోగాస్ట్రీట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 202, వాకర్స్ క్లబ్, జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. యోగ సాధనతో శరీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంత జీవితం గడపొచ్చని సూచించారు. జిల్లాలో పది లక్షల మంది యోగా సాధన చేయాలన్న లక్ష్యంతో గ్రామ, మండల, పట్టణల్లో నిత్యం యోగాపై శిక్షణ ఇస్తున్నామన్నారు. వాకర్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ టి.హనుమంతరావు మాట్లాడుతూ.. పతంజలి మహర్షి అందించిన గొప్ప వరమే యోగ అని పేర్కొన్నారు. సర్వరోగ నివారణకు తోడ్పడే యోగా ఆచరిస్తే ఆరోగ్యంగా జీవించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి జె.శివ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేమూరి బాబు రావు, మోతుకూరి వెంకటేశ్వరరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 202 పూర్వపు గవర్నర్ అమర్నాథ్, గవర్నర్ ఎ.విజయలక్ష్మి, కార్యదర్శి పి.పుష్పలత, కోశాధికారి టి.బాలాజీ, జేసీఐ ప్రతినిధులు కె. రాజేంద్రరెడ్డి, కె.గణేష్బాబు, జె.స్వాతి, దత్తాత్రేయ యోగా క్లబ్ ప్రతినిధులు డి.తిరుపతిరాజు, రఘు స్వామిజీ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ