
హెచ్ఐవీ బాధితులు మనోధైర్యంతో జీవించాలి
గాంధీనగర్/మధురానగర్(విజయవాడసెంట్రల్): హెచ్ఐవీ బాధితులు మనోధైర్యంతో జీవించాలని ఎన్టీఆర్ జిల్లా అదనపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జూపూడి ఉషారాణి సూచించారు. బావాజిపేట లోని నవజీవన్ బాల భవన్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు మంగళవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తయారీపై అవగాహన కల్పించారు. ఉషారాణి మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. నవజీవన్ బాలభవన్ ప్రతి నెలా పౌష్టికాహారం అందజేయడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, విద్యార్థులను చదివించడం, సూక్ష్మ, మధ్యతరగతి వ్యాపారాలు ఏర్పాటుచేసుకోవడానికి సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. నవజీవన్ బాల భవన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫాదర్ అంతయ్య మాట్లా డుతూ.. హెచ్ఐవీ బాధిత కుటుంబాలకు ప్రతి నెలా పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, వారి కుటుంబాల్లోని బాల బాలికల చదువుకు సహాయం చేయడం ద్వారా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ శాంసన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఏఆర్టీ మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవ జీవన్ బాల భవన్ అడ్మిస్ట్రేటర్ ఫాదర్ మర్రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్ బాబు, జోనల్ కోఆర్డినేటర్లు జాకబ్ రాజు, నజ్మా, ప్రియాంక, దేవ మణి, వెంకటేశ్వరావు, రమేష్, జ్యోతిచంద్రిక, వలంటీర్లు హైమావతి, దుర్గ, రాణి, హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితులు పాల్గొన్నారు.
ఏఎంహెచ్ఓ జూపూడి ఉషారాణి