వర్ని: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సును నిర్వహించారు. కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నియంత్రించవచ్చని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడవచ్చని వెల్లడించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ బాల్ సింగ్, జాకోరా సొసైటీ చైర్మన్ దశరథ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


