బోధన్: పట్టణ కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్, లయన్స్ కంటి ఆస్పత్రి, మ నోరమ హస్పిటల్ అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది.ప్రజలు, న్యాయవాదులు, పోలీ సు ,కోర్టు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఈశిబిరాన్ని ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి వరూధుని ప్రారంభించారు. నిర్వాహకులను న్యా యమూర్తులు అభినందించారు.న్యాయమూర్తులు కాంచనరెడ్డి, మర్కల్ పూజిత, సాయి శివ, ఏసీపీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీఆర్ దేశాయ్, ప్రతినిధులు విద్యాసాగర్, ఈశ్వర్, బానోత్ రమేశ్,న్యాయవాదులు ,వివిధ విబాగాల వైద్యులు పాల్గొన్నారు.


