డొంకేశ్వర్(ఆర్మూర్): తొలకరి వర్షం పంటలకు జీవం పోసింది. ఆదివారం డొంకేశ్వర్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వర్షం కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. విత్తనాలు విత్తి వరుణుడి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వర్షం ఎంతో మేలు చేసింది. మండలంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు అడ్డం పడ్డగా స్థానికులు వాటిని తొలగించారు.
తొండాకూర్లో నేలకొరిగిన చెట్టు
తొండాకూర్ శివారులోని పొలం మడుల్లో నిలిచిన వర్షపు నీరు


