నిజామాబాద్ రూరల్: నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని కొ త్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయం ఉత్తర దిక్కున ఉన్న కోనేరు వద్ద పు లిని వేటాడుతూ మరణించిన వీరుని యాదిలో వేసిన పులివేట వీరగల్లు శిల్పాన్ని గుర్తించారు. ప్రతిమ లక్షణాల్ని వివరించారు. నీలకంఠేశ్వరాలయ నిర్మాణం ఉత్తర భారతీయ శైలిలో ఉందని, 2 వేల సంవత్సరాల ఘన చరిత్ర కల్గినదని తెలిపారు.వారి వెంట భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు తీగల రఘు తదితరులు ఉన్నారు.


