పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004–05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుదీర్ఘకాలం తర్వాత కలుసుకోవడంతో పరస్పర యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
వాణి విద్యాలయంలో..
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి వాణి విద్యాలయం ఉన్నత పాఠశాల 2000–01 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉల్లాసంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థుల సందడి చేశారు. 25 ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.


