అదృశ్యమైన యువకుడు.. | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన యువకుడు..

Jun 19 2025 4:34 AM | Updated on Jun 19 2025 4:34 AM

అదృశ్యమైన యువకుడు..

అదృశ్యమైన యువకుడు..

మాక్లూర్‌ : పొలానికి వెళ్లొస్తానని చెప్పి మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అడవిమామిడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్‌ ఎస్సై రాజశేఖర్‌ కథనం ప్రకారం.. అడవిమామిడిపల్లికి చెందిన గంగోనె హరీశ్‌(34) మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి హరీశ్‌ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో హరీశ్‌ ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పశువుల కాపర్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతుడి కుటుంబసభ్యుడైన నారాయణ ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. హరీశ్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని వివరించారు.

గుండెపోటుతో ఒకరి మృతి

గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్‌ గ్రామానికి చెందిన కంది సంజీవులు(32) గుండెపోటుతో బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సంజీవులు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మూడు రోజుల జైలు

మోపాల్‌: మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై యాదగిరి గౌడ్‌ తెలిపారు. డిచ్‌పల్లి మండలంలోని ఘన్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ నయీమ్‌ మద్యం సేవించి వాహనం నడుపుతూ మోపాల్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిని బుధవారం కోర్టులో హాజరుపర్చగా ప్రత్యేక ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నూర్జహాన్‌ బేగం మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement