డీఈవో ఆఫీస్‌ స్థలం కోర్టుకు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

డీఈవో ఆఫీస్‌ స్థలం కోర్టుకు కేటాయించాలి

Jun 19 2025 4:34 AM | Updated on Jun 19 2025 4:34 AM

డీఈవో

డీఈవో ఆఫీస్‌ స్థలం కోర్టుకు కేటాయించాలి

నిజామాబాద్‌ లీగల్‌: జిల్లా కోర్టు ప్రాంగణంలో సరిపడా స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని, కోర్టు పక్కనే ఉన్న పాత డీఈవో ఆఫీసు స్థలాన్ని కోర్టుకు కేటాయించాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డిని కోరారు. కలెక్టర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాత డీఈవో ఆఫీస్‌ స్థలం కేటాయిస్తే కోర్టు పార్కింగ్‌ స్థలంతోపాటు ఇతర అవసరాలకు సరిపోతుందన్నారు. స్పందించిన కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి జిల్లా జడ్జి జీవీఎన్‌ భరతలక్ష్మి సైతం ఈ విషయంపై చర్చించారని, త్వరలో దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బార్‌ సోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్‌రాజ్‌, ప్రభుత్వ అడ్వకేట్‌ మామిడాల సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన కమాండెంట్‌

డిచ్‌పల్లి: కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన టీ వినయ్‌కృష్ణారెడ్డిని రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడో బెటాలియన్‌ డిచ్‌పల్లి కమాండెంట్‌ పీ సత్యనారాయణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి..

సుభాష్‌నగర్‌: కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వినయ్‌ కృష్ణారెడ్డిని నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. డీఎంవో గంగుబాయి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ అపర్ణ, గ్రేడ్‌–2 సెక్రటరీ శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ను కోరిన బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు

డీఈవో ఆఫీస్‌ స్థలం కోర్టుకు కేటాయించాలి 1
1/2

డీఈవో ఆఫీస్‌ స్థలం కోర్టుకు కేటాయించాలి

డీఈవో ఆఫీస్‌ స్థలం కోర్టుకు కేటాయించాలి 2
2/2

డీఈవో ఆఫీస్‌ స్థలం కోర్టుకు కేటాయించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement