గిరిరాజ్‌ కళాశాల ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

గిరిరాజ్‌ కళాశాల ఫలితాలు విడుదల

Jun 19 2025 4:34 AM | Updated on Jun 19 2025 4:36 AM

నిజామాబాద అర్బన్‌ : గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల ఫలితాలను విడుదల చేసినట్లు ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌, మే నెలలో నిర్వహించిన రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ పరీక్షల ఫైనల్‌ ఫలితాలు, 1, 3, 5వ బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల చేశామన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి శాంతాబాయి ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. యూజీ ఫైనలియర్‌లో 82.47 శాతం, 4వ సెమిస్టర్‌లో 50.97 శాతం, రెండో సెమిస్టర్‌లో 42.39 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు.

ఇన్‌చార్జి మంత్రిని

కలిసిన రూరల్‌ ఎమ్మెల్యే

డిచ్‌పల్లి: జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన సీతక్కను బుధవారం నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీతక్కకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. అనంతరం రూరల్‌ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలను మంత్రికి వివరించారు.

పీఈ సెట్‌లో రాష్ట్రస్థాయి

15వ ర్యాంకు

సిరికొండ: పీఈ సెట్‌లో మండలంలోని వర్జన్‌ తండాకు చెందిన బదావత్‌ శ్రీజ రాష్ట్రస్థాయి 15వ ర్యాంకు సాధించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 14న పీఈ సెట్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఎంపికై న శ్రీజ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. మండల కేంద్రంలో ఇంటర్‌ పూర్తిచేసిన శ్రీజ క్రీడలపై మక్కువతో పీఈ సెట్‌లో పాల్గొంది. శ్రీజ తండ్రి శివరాం సిరికొండ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి లలిత వ్యవసాయం చేస్తుంది.

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీల నివారణకు చర్యలు చేపడదాం

బోధన్‌టౌన్‌(బోధన్‌): ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీల నివారణకు పోలీసు, విద్యుత్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు చేపడదామని ఏసీపీ శ్రీనివాస్‌, డీఈ ముఖీద్‌ పేర్కొన్నారు. బోధన్‌లోని ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఏసీపీ, వి ద్యుత్‌ డీఈల ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌ఫార్మర్లు చోరీలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, సిబ్బందితో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయిస్తామన్నారు. సమావేశంలో సీఐలు వెంకటనారాయణ, విజయ్‌బాబు, విద్యుత్‌ శాఖ ఏఈలు పాల్గొన్నారు.

బంగారంతో పరారీ

ఖలీల్‌వాడి: ఆభరణాల తయారీకి ఇచ్చిన బంగారంతో పరారైన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైనట్లు ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. నగరంలోని ఆర్యనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ 18 తులాల బంగారు ఆభరణాలు చేయాలని కుమార్‌గల్లికి చెందిన సద్గురుమూర్తి, సాయిప్రసాద్‌లకు ఫిబ్రవరిలో నగదు ఇచ్చాడు. 18 తులాల్లో 10 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చి, మిగతా 8 తులాలు ఇవ్వలేదు. 15 రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకొని, షాపు మూసివేశారని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

గిరిరాజ్‌ కళాశాల  ఫలితాలు విడుదల 1
1/2

గిరిరాజ్‌ కళాశాల ఫలితాలు విడుదల

గిరిరాజ్‌ కళాశాల  ఫలితాలు విడుదల 2
2/2

గిరిరాజ్‌ కళాశాల ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement