ప్రజావాణికి 114 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 114 ఫిర్యాదులు

Apr 29 2025 9:55 AM | Updated on Apr 29 2025 9:55 AM

ప్రజావాణికి 114 ఫిర్యాదులు

ప్రజావాణికి 114 ఫిర్యాదులు

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అదనపు కలెక్టర్‌తోపాటు నిజామాబాద్‌ ఇన్‌చార్జి ఆర్డీవో స్రవంతి, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌కు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement