నిర్మల్చైన్గేట్: ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఆదివా రం నిర్వహించే భారీ బహిరంగ సభను విజ యవంతం చేయాలని సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మాట్లాడారు. ఈ సభకు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సమరశంఖం పూరిస్తారని వివరించారు. మోదీ వస్తున్నాడు–భరోసా ఇస్తున్నాడు అనే నినాదంతో ఈ భారీ బహిరంగను చేపడుతున్నట్లు తెలిపారు.


