గంగారాం, శ్రీనివాస్కు అన్నం
తినిపిస్తున్న తల్లి లక్ష్మి
లోకేశ్వరం: మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన కుతాడి లక్ష్మి–గంగారాం దంపతులకు నలుగురు కుమారులు కాగా అందులో శ్రీనివాస్(31), గంగన్న(28) పుట్టినప్పటి నుంచి శారీరక, మానసిక దివ్యాంగులు. కనీ సం నడవలేరు. వీళ్లు బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రులు మోయాల్సిందే. వారికి ఆకలి తెలియదు. బాధ తెలియదు. అవసరాలన్ని అమ్మే తెలుసుకోవాలి. భార్య భర్తలు కూలీ చేసేవారు. 30 ఏళ్లుగా లక్ష్మి నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కుమారులకు చంటి పిల్లల్లా సపర్యలు చేస్తూనే ఉంటుంది.


