భైంసాటౌన్: భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలిగా ఎంఐఎంకు చెందిన హుమెరాబేగం ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్ నవీన్ తెలి పారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో ధ్రువపత్రం అందజేశారు. మిగిలిన ముగ్గురి కి ఎన్నిక నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు.
కోర్టుకు వెళతాం
భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిబంధనల మేరకు జరగలేదని చైర్మన్ తూమోల్ల దత్తాత్రి తెలిపారు. ఎంఐఎం అభ్యర్థికి కోఆప్షన్ సభ్యురాలిగా ధ్రువపత్రం ఇవ్వడంపై మున్సిపల్ కమిషనర్ నవీన్ను నిలదీశారు. దీనిపై కోర్టుకు వెళతామని వెల్లడించారు.


