
భవన నిర్మాణం ఆపాలని ఆందోళన
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎస్సీ కుల(మాల) సంఘ భవన నిర్మాణం పనులు నిలిపివేయాలని కోరుతూ మాదిగ సంఘం సభ్యులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్వారి మడిగెలు(రూములు) ఉండేవని, ఇటీవల అనుమతి లేకుండా ఎస్సీ మాల సంఘం సభ్యులు కూలగొట్టి అక్కడ మాల సంఘ భవనం నిర్మాణం పనులు చేపడుతున్నారన్నారు. నిర్మాణ పనులు నిలిపి వేసి తమకు న్యాయం చే యాలని కోరారు. అనంతరం తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధకు వినతిపత్రం అందజేశారు.