అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తా | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తా

Jun 19 2025 4:00 AM | Updated on Jun 19 2025 4:00 AM

అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తా

అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తా

● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

సారంగపూర్‌: అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జామ్‌ నుంచి బోరింగ్‌తండా వరకు రూ.3.20 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రారంభించారు. అనంతరం సారంగాపూర్‌, బీరవెల్లిలో లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులు వేగంగా పనులు చేపడితే నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.

రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆందోళన

మండలంలోని దుర్గానగర్‌కు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్పందించిన ఎ మ్మెల్యే వెంటనే పీఆర్‌ డీఈఈ తుకారాం, ఆర్‌అండ్‌ బీ అధికారులతో మాట్లాడారు. గురువారం పనులు ప్రారంభమవుతాయని, కానిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ వ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు గంగారెడ్డి, తక్కల రమణారెడ్డి, రాజేందర్‌ రెడ్డి, విలాస్‌, తిరుమలాచారి, నారాయణ, కొరిపెల్లి రాజు, ఆర్‌వీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణానికి భూమిపూజ

నిర్మల్‌చైన్‌గేట్‌: పట్టణంలోని బంగల్‌పేట్‌ కాలనీలో రూ.10 లక్షల నిధులతో చేపట్టిన ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణానికి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదిరాజ్‌ల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి, నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, నాయకులు పాతర్ల గణేశ్‌, ఆనంద్‌, పాతర్ల హరీష్‌, యాటకారి సాయన్న, పాతర్ల వెంకటి, పరమేశ్‌, దేవిదాస్‌, జింక సూరి, జుట్టు దినేష్‌, గిల్లి విజయ్‌, గవాస్కర్‌, చరణ్‌ మౌర్య, మున్సిపల్‌ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement