
ఘనంగా ప్రతిష్ఠాపనోత్సవాలు
నిర్మల్టౌన్/నిర్మల్ చైన్గేట్: జిల్లాకేంద్రంలోని భాగ్యనగర్ రాధాకృష్ణ ఆలయంలో రాధామురళీకృష్ణ విగ్రహాల పునఃప్రతిష్ఠాపనోత్సవా లు కొనసాగుతున్నాయి. బుధవారం పూజలు, అభిషేకాలు, అర్చన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హాజరై ధ్వజస్తంభానికి పూజలు చేశా రు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐకేరెడ్డిని స త్కరించారు. ఐకే రెడ్డి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ ఈశ్వర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్రెడ్డి, నాయకులు రమణారెడ్డి, పాకాల రాంచందర్, శ్రీకాంత్యాదవ్ తదితరులున్నారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కూడా హాజరై పూజలు చేశారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ సోమా భీమ్రెడ్డి, గండ్రత్ ఈశ్వర్, నాందేడపు చిన్ను తదితరులున్నారు.