
నిర్మల్
జీవాల పెంపకానికి చేయూత
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మాంసం ఉత్పత్తులు పెంచాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. జీవాల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది.
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
8లోu
శాంతిభద్రతల పరిరక్షణకే కమ్యూనిటీ కాంటాక్ట్
● ఏఎస్పీ రాజేశ్మీనా
లక్ష్మణచాంద: శాంతి భద్రతల పరిరక్షణకు గ్రా మాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా తెలిపారు. మండలంలోని మునిపెల్లి గ్రామంలో మంగళవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించా రు. ఇందులో భాగంగా సరైన ధ్రువపత్రాలు లే ని 90 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ఏఎస్పీ మా ట్లాడారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లోకి అపరిచితులు వచ్చినా, అసాంఘిక కార్యకపాలు జరిగినా, దొంగతనాలు జరిగినా సీసీ కెమెరాలతో త్వరగా గుర్తించే వీలుంటుందని వివరించారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రూ ల్స్ తప్పకుండా పాటించాలన్నారు. వాహనా లకు సంబంధించి ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, అపరిచితులకు పిన్, ఆధార్, వ్యక్తిగత వివరాలు చెప్పొద్దని సూచించారు. కార్యక్రమంలో సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సైలు మాలిక్ రెహమాన్, గోపి పాల్గొన్నారు.
● అమ్మకుండా.. వండుకుంటున్నారు..
● పంపిణీ పై లబ్ధిదారుల సంతృప్తి
● రేషన్షాపుల వద్ద బారులు
నిర్మల్ చైన్గేట్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సన్న బియ్యం నాణ్యతపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరైన పద్ధతిలో వండితే ఎలాంటి సమస్య లేదని, గంజి సరిగా వార్చకపోతే కొద్దిగా మెత్తగా ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లాలో ఈనెల మొదటి వారంలోనే సన్న బియ్యం సరఫరా ప్రారంభమై, 70 నుంచి 80 శాతం మంది లబ్ధిదారులు ఇప్పటికే తమ కోటా బియ్యం తీసుకున్నారు.
నాణ్యతపై ప్రజల ఆనందం
రేషన్ షాపుల ద్వారా గత నెల వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. వీటిని చాలా మంది విక్రయించి సన్న బియ్యం కొనేవారు. అమ్మిన బియ్యాన్నే మిల్లర్లు మళ్లీ సేకరించి ప్రభుత్వానికి అప్పగించేవారు. అయితే అక్రమాలకు చెక్ పెట్టేందుకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల నుంచి పంపిణీ ప్రారంభించింది. జిల్లాలో పంపిణీ సజావుగా సాగుతోంది. లబ్ధిదారులందరూ సన్న బియ్యం తీసుకోవడమే కాకుండా వండుకుని తింటున్నారు. దీంతో అమ్మెవారు కనిపించడం లేదు. కొత్త బియ్యం కావడంతో కొంత మెత్తదనం ఉన్నప్పటికీ, సరైన వంట పద్ధతులతో ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. కొన్ని చోట్ల స్వల్పంగా నూకలు ఉన్నప్పటికీ, గతంలో అందించిన దొడ్డు బియ్యంతో పోలిస్తే సన్న బియ్యం రుచి, నాణ్యతలో ఉన్నాయని పేర్కొంటున్నారు.
తినేందుకే ప్రాధాన్యం
గతంలో దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో, చాలామంది లబ్ధిదారులు వాటిని ఇడ్లీ, దోసెలు, పిండి పట్టించడం వంటి ఇతర అవసరాలకు ఉపయోగించారు. కొందరు దొడ్డు బియ్యాన్ని అమ్ముకుని సన్న బియ్యం కొనేవారు. అయితే, సన్న బియ్యం నాణ్యతతో ఆకర్షణీయంగా ఉండటంతో దీనిని ప్రధానంగా తినేందుకే వినియోగిస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. సన్న బియ్యాన్ని అన్నం వండుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులతో మాట్లాడిన ‘సాక్షి’ బృందం, సన్న బియ్యం నాణ్యతపై సంతృప్తి, దాని వినియోగంలో సానుకూల ధోరణిని గమనించింది.
సమర్థవంతమైన నిర్వహణ
సన్న బియ్యం పంపిణీ రేషన్ షాపుల ద్వారా సజావుగా కొనసాగుతోంది. తొలి మూడు నాలుగు రోజుల్లో లబ్ధిదారులు రేషన్ షాపుల వద్ద బారులు తీరారు, 70 నుంచి 80 శాతం మంది ఇప్పటికే తమ వాటాను స్వీకరించారు. ఈ సమర్థవంతమైన పంపిణీ వల్ల లబ్ధిదారులకు సకాలంలో బియ్యం అందింది. రేషన్ షాపుల వద్ద ఎలాంటి గందరగోళం లేకుండా, వేగంగా పంపిణీ జరిగింది. సన్న బియ్యం అందుబాటులోకి రావడంతో, లబ్ధిదారులు తమ కోటాను స్వీకరించారు.
చిన్నారికి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నపు బియ్యం అన్నం తినిపిస్తున్న తల్లి
నీటి ఇబ్బందులు రావొద్దు
భైంసారూరల్: మండలంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. మండల పరిషత్ కార్యలయంలో కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఉపాధిహామీ పథకంలో పొలాలకు వెళ్లే రహదారులు నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ నాగవర్ధన్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్నం ముద్దగా అవుతోంది..
రేషన్ దుకాణంలో ఇస్తున్న సన్న బియ్యం వండితే అన్నం ముద్దగా అవుతుంది. తినడానికి ఇబ్బందిగా ఉంది. బియ్యంలో సగానికిపైగా నూకలు. ఉన్నాయి. సన్న బియ్యం ఇవ్వడం సంతోషమే కానీ తినడానికి వీలుగా ఉండే బియ్యం ఇస్తే బాగుంటుంది. – అరుణ, నిర్మల్
నూకలు వస్తున్నయి..
మా కుటుంబానికి ఈనెల సన్నబియ్యం ఇచ్చిండ్రు. అందులో కొంత వరకు నూకలు వచ్చినయి. మిగతా బియ్యం మంచిగనే ఉన్నయ్. ఇవే మాకు ఆధారం. ప్రతీనెల సన్నబియ్యం ఇస్తే మాకు ఎంతో ఆసరాగా ఉంటుంది.
– విజయ, వైఎస్సార్ కాలనీ
ఎప్పుడూ ఇలాగే పంపిణీ చేయాలి
సన్న బియ్యం ఈ నెల మాదిరిగానే ప్రతీనెల పంపిణీ చేయాలి. దీంతో లబ్ధిదారులెవరూ రేషన్ బియ్యం బయట విక్రయించరు. అక్రమాలకు అవకాశం ఉండదు. కొత్త రేషన్ కార్డులు రాక చాలా మందికి అర్హత ఉన్నా అందడం లేదు. – బొప్పారపు శ్రీనివాస్, ఖానాపూర్
న్యూస్రీల్
మార్కింగ్ పూర్తి చేయాలి
నిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్(ముగ్గు పోసే ప్రక్రియ) ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియపై సంబంధిత అధికా రులతో మంగళవారం సమావేశం నిర్వహించా రు. ఇప్పటి వరకు మంజూరైన ఇళ్ల లబ్ధిదారులు పూర్తిచేసిన మార్కింగ్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ ఏఈ మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ దగ్గరుండి చేయించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో గోవింద్, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ఈ నెల 15 వరకు రేషన్ తీసుకున్న
వారి వివరాలు:
జిల్లాలోని మొత్తం రేషన్ షాపులు 412
ఇప్పటివరకు రేషన్ అందుబాటులో
ఉన్న షాపులు 407
జిల్లాలోని మొత్తం కార్డు దారులు 2,08,380
రేషన్ పొందిన కార్డు దారులు 1,68,016
లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్న బియ్యం 35,07,083 కిలోలు
వండుకుని తింటున్నం..
ప్రభుత్వం దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం ఇవ్వడంతో వండుకుని తింటున్నం. గతంలో దొడ్డుబియ్యం తెచ్చుకుని దోశలు చేసుకునేందుకు పిండి పట్టించుకునే వారం. ఇప్పుడు అన్నం వండు కొని తింటున్నం. – గంగేశ్వరి, నిర్మల్
సన్న బియ్యం ఇవ్వడం సంతోషకరం..
ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. సన్న బియ్యం బాగానే ఉన్నాయి. బయట కొనుక్కునే ఖర్చు తగ్గింది. అయితే అన్నం వండితే మెత్తగా అవుతుంది. రెండు, మూడు రకాల బియ్యం కలవడం వల్ల అలా అవుతుంది.
– దండు శ్యామల, న్యూవెల్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్