షాకింగ్‌ : కోతిని తరమబోయి.. సజీవ దహనం! | While Chasing Monkey a man Electrocuted In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : కోతిని తరమబోయి.. సజీవ దహనం!

Apr 15 2026 7:29 PM | Updated on Apr 15 2026 8:12 PM

While Chasing Monkey a man Electrocuted In Madhya Pradesh

మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్‌లో  విషాదం చోటు చేసుకుంది. కోతులను తరమబోయి ఒక రిసార్ట్ ఉద్యోగి మరణించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్‌తో  అక్కడి కక్కడే మరణించాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం, ఖజురహో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రిసార్ట్ పైకప్పుపైకి కోతి వచ్చింది. దీంతో ఇనుప రాడ్‌తో కోతిని తరమడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో కోతిని భయపెట్టి, దాన్ని తరిమికొట్టడానికి రాడ్‌ను పైకి ఎత్తినప్పుడు, అది రిసార్ట్ పైకప్పుపై ఉన్న హై-వోల్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. 33 kV హై-టెన్షన్ తీగ కావడంతో తీవ్రమైన విద్యుదాఘాతానికి రాను రైక్వార్‌  చనిపోయాడు. ఖజురహో నివాసి అయిన  రాను ఐదు రోజుల క్రితమే ఆ రిసార్ట్‌లో చేరాడు.

బమితా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం  తరలించారు. రిసార్ట్ పైకప్పుకు సమీపంలో హై-టెన్షన్ లైన్ ఉండటం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా ఈ సంఘటన రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని బమితా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ వాల్మీకి చౌబే తెలిపారు. 

ఇదీ చదవండి: టీసీఎస్‌ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్‌

 రిసార్ట్ యజమాని జయ్ తివారీ మాట్లాడుతూ, కోతిని తరిమికొట్టే ప్రయత్నంలో ఈ విషాద సంఘటన జరిగింది. రిసార్ట్ పైనుంచి నేరుగా 33 కేవీ రైల్వే లైన్ వెళుతుంది. దానిని తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, రైల్వే అధికారులు తొలగించడానికి నిరాకరించారు. మృతుడికిను రైక్వార్‌కు ఇద్దరు చిన్న పిల్లలన్నారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement