బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక నుండి రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. బెంగుళూరులోని విధానసౌధలో ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం డీ.కె. శివకుమార్, సిద్ధరామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే కొనసాగుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచే పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా మరోసారి అదే రాష్ట్రం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కన్నడలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం రీత్యా ఆయన రాజ్యసభ ఎంపిక దాదాపు లాంఛనమే. కాగా రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1 న నోటిఫికేషన్ విడుదలవగా జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.


