ప్రధాని మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు | Kharge makes scathing remarks against Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

Apr 21 2026 3:40 PM | Updated on Apr 22 2026 12:16 PM

Kharge makes scathing remarks against Modi

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాటలు  ఇప్పుడు తీవ్రదుమారం రేపుతున్నాయి.

తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్‌ విజయ్‌ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement