పల్లెటూరిలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రతిభావంతురాలిగా ఎదిగింది, ఐటీ కంపెనీలో కళ్లు చెదిరే వేతనంతో ఉద్యోగం సంపాదించింది. హావేరి జిల్లాకు చెందిన రైతు మంజునాథ్ కూతురు సృష్టి దక్షిణ కన్నడ జిల్లాలో బీటెక్ కోర్సు పూర్తి చేసింది. ప్రముఖ సంస్థ వీసా లో రూ.46.33 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొందింది. ఆమె అదే సంస్థలో ఇంటర్న్షిప్ చేస్తూ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు.
-బెంగళూరు
చదవండి: గణేశ్ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు


