భారత్‌లో కొత్తగా 41,810 కరోనా కేసులు

Corona Updates: 41,810 New Corona Cases Reported In India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 41,810 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,92,920కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,696కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 88,02,267కు చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,53,956గా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 42,298 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.   చదవండి:   (టీకా పురోగతి భేష్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top