
కొత్త రైతులకు అవకాశం
వివరాలు 8లో u
నారాయణపేట: రైతులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులు సైతం పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జూన్ 5 వరకు పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతుల నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. కొత్త పట్టా పాసుపుస్తకం , బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్ లతో సంబంధిత ఏఈఓల వద్ద రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్ సూచించారు.
12వేల మంది కొత్త రైతులు
గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 5 వరకు 13 మండలాల్లోని 253 రెవెన్యూ గ్రామాల్లో 12,950 కొత్త పట్టా పాసుపుస్తకాలు ఉన్నట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. కాగా గతేడాదికి సంబంధించి 8 వేల మంది పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులు ఉండగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మరో 4,950 మంది పొందారు. గతేడాదిలో ఒక సారి మాత్రమే పెట్టుబడి సాయం అందడంతో కొత్త పట్టా పాసు పుస్తకం పొందిన వారికి రైతు భరోసా దక్కలేదని రైతులు వాపోయారు. ఈ ఏడాది వానాకాలంలో రైతు భరోసాను ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా కొత్త పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులు సైతం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు రావడం.. ఈ నెల 20 వరకు గడువు విధించడంతో రైతులు దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు.
‘రైతు భరోసా’కు రేపటితోముగియనున్న దరఖాస్తు గడువు
జిల్లాలో 12,950 మందికి కొత్త పాసుపుస్తకాలు
ఇప్పటికే 25,929 మంది రైతుల ఖాతాల్లో రూ.38.90 కోట్లు జమ

కొత్త రైతులకు అవకాశం