
గడువు పెంచితే బాగుండు..
మా పొలం దగ్గర ఉన్న నాలుగు గుంటల భూమి కొనుగోలు చేశా. రైతు భరోసా కోసం ఇటీవల స్థానిక రైతు వేదిక దగ్గర ఏఈఓకు దరఖాస్తు చేసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అందరికి వేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది. కొత్త పట్టపాసుపుస్తకాలు వచ్చిన రైతులకు సైతం వెంటనే ఆప్లోడ్ చేసి రైతుభరోసా వేయాలని కోరుతున్నాం. ఈ నెల 20వరకు పెట్టిన గడువును పెంచితే బాగుంటుంది.
– ఉప్పరి రవీందర్, రైతు, వర్కూర్ గ్రామం, మాగనూర్ మండలం
సద్వినియోగం చేసుకోవాలి
జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన వారు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 20వ తేదీ వరకు ఏఈఓలను కలిసి ఆధార్, బ్యాంకు ఖాతా, పట్టా పాసుపుస్తకాల జిరాక్స్ కాపీలను అందజేయాలి. ఆ తర్వాత పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తాం. వారికి సైతం రైతు భరోసా వస్తుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– జాన్సుధాకర్, డీఏఓ
●