విద్యార్థులు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Jun 19 2025 4:00 AM | Updated on Jun 19 2025 4:00 AM

విద్య

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

మక్తల్‌: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని డీవైఎస్‌ఓ వెంకటేశ్‌శెట్టి, ఎంఈఓ అనిల్‌గౌడ్‌ అన్నారు. బుధవారం క్రీడా పాఠశాలలో నాల్గో తరగతిలో ప్రవేశాల నిమిత్తం పట్టణంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. మొత్తం 30 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో రిటైర్ట్‌ పీఈటీ గోపాలం, విష్ణువర్ధన్‌, రాజేశ్వరి, దామోదర్‌, రమేష్‌, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు మంత్రి పొన్నం రాక

పాలమూరు: జిల్లాకేంద్రంలో ఈనెల 20న రాష్ట్ర రవాణా, బీసీ వెల్ఫేర్‌ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్టీఏ, ఆర్టీసీ, బీసీ వెల్ఫేర్‌ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం ఈ సమావేశానికి హాజరుకాన్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు సమీక్ష సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు.

ఉల్లి క్వింటాల్‌ రూ.2,100

దేవరకద్ర/జడ్చర్ల: ఉల్లి సీజన్‌ తగ్గిపోవడంతో బుధవారం దేవరకద్ర మార్కెట్‌కు ఉల్లి రావడం తగ్గింది. ఐదు నెలలుగా కొనసాగిన ఉల్లి సీజన్‌ మూడు వారాల నుంచి తగ్గడంతో ధరలు కొంత మేర పెరిగాయి. మార్కెట్‌కు కేవలం 200 బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వేలంలో ఉల్లి క్వింటాల్‌ ధర గరిష్టంగా రూ.2,100, కనిష్టంగా రూ.1,100గా పలికింది. మార్కెట్‌కు వచ్చిన ఉల్లిని ఎక్కువగా వినియోగదారులే కొనుగోలు చేశారు. వ్యాపారులు బస్తాకు రూ. 50 నుంచి రూ. 100 వరకు లాభం చూసుకుని ఉల్లిని విక్రయించారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,267, కనిష్టంగా రూ.1,569, ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,139, కనిష్టంగా రూ.1869 ధర పలికాయి.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి  
1
1/1

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement