
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే వేడుకలు
నారాయణపేట టౌన్/ నారాయణపేట రూరల్: జిల్లా వ్యాప్తంగా గుడ్ఫ్రైడేను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సర్వమానవాళికి రక్షణ లభిస్తుందని, పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని పాస్టర్లు సందేశమిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంబీ ఎబినేజర్ చర్చిలో డి.శోభారాణి సాల్మన్, బి.తిమోతి, ఆర్.మేరి సత్యపాల్,యం.దేవిపుత్ర,సహోదరి కే.సంకీర్తన చదివి వినిపించారు. ప్రతి ఒక్కరు సత్పవర్తనతో క్రీస్తు అడుగుజాడల్లో నడవాలని అన్నారు. అలాగే, మండలంలోని బైరంకొండ, సింగారం, కొల్లంపల్లి గ్రామాల్లోని చర్చీల్లో క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు. రెవరెండ్ పాస్టర్ నగేష్ మాట్లాడుతూ సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు మానవాళి ఆత్మరక్షణ కోసం ప్రాణ త్యాగం చేశారని, ఏసు ప్రభువు శిలువపై వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా శుభ శుక్రవారంగా జరుపుకొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ పెద్ధలు, పాస్టర్ రెవ.అమృతకుమార్,అధ్యక్షులు బ్రదర్ బి.వినోద్కుమార్, ఎస్.డి.ఆనంద్కుమార్,మురళి మోహన్రెడ్డి, పరంజ్యోతి, శేశమ్మ పాల్గొన్నారు.