
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇంతటి ప్ర
గత ప్రభుత్వ హయాంలో కంటి పరీక్షలు చేస్తున్న సిబ్బంది (ఫైల్)
● ఈ–ఐ కేంద్రాలకు ‘చంద్ర’ గ్రహణం
● పేదలకు ఉచిత కంటి పరీక్షలు,
కళ్లాద్దాల పంపిణీకి మంగళం
● కంటి వెలుగు, ఆరోగ్య సురక్ష
కార్యక్రమాలను చాపచుట్టిన
కూటమి ప్రభుత్వం
● అప్తాల్మిక్ అసిస్టెంట్లు,
డేటా ఆపరేటర్లకు ఉద్వాసన
● అవస్థలు పడుతున్న
దృష్టిలోపం ఉన్న బాధితులు
● సమస్య వస్తే ప్రైవేటు వైద్యమే
దొర్రిపాడు మండలం క్రిష్టిపాడుకు చెందిన దస్తగిరమ్మ అనే వృద్ధురాలు కళ్లు మసకబారటంతో కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలలోని సీఎం ఈ – ఐ కేంద్రానికి వెళ్లమని గ్రామస్తులు చెప్పారు. ఆమె వైద్యశాలకు చేరుకోగా అక్కడ ఈ–ఐ కేంద్రం మూతవేసి ఉండటంతో పక్కనున్న జనరల్ డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్య చెప్పారు. నంద్యాల వైద్యశాలకు వెళ్లమని సిఫారుసు చేశారు. ఇంటికి వచ్చి విచారించగా ప్రైవేటు వైద్యశాలకు వెళితే కనీసం రూ. 10 వేలకు పైగానే ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత స్థోమత లేక ఇంటి దగ్గరే మసమసక చూపుతో నెట్టుకొస్తున్నాని ఆవేదన చెందుతోంది.
చాగలమర్రికి చెందిన సుబ్బమ్మ కూలి పనికి వెళ్లగా ప్రమాదవశాత్తు కంటికి గాయమైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆళ్లగడ్డ ఈ–ఐ కేంద్రానికి తీసుకు వచ్చారు. ఇక్కడ వైద్య సేవలు నిలిచి పోయాయని ప్రైవేటు ఆసుపత్రికి పోవాలని అక్కడున్న వారు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే వైద్య పరీక్షలు నిర్వహించి కొన్ని మందులు ఇచ్చి రూ. 1,600 తీసుకున్నారు. దీంతో పాటు కంటి అద్దాలు రాసి ఇవ్వగా రూ. 1,500 అయ్యింది. మొత్తం రూ. 3 వేలకు పైగా అయిందని మళ్లీ వారానికి ఒక రోజు వచ్చి చూపించుకుని వెళ్లాలని సూచించారు.
గతంలో ఇలా..
60 ఏళ్లులోపు వారికి రేషన్ కార్డు అవసరం లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఈ–ఐ కేంద్రాల్లో కంటి వైద్య పరీక్షలు చేసేవారు. దృష్టిలోపం ఉన్న వారికి ఖరీదైన ఫైబర్ కళ్ల అద్దాలు అందజేసేవారు. ఇందులో లబ్ధిదారుడు అతనికి ఇష్టమైన కలర్, సైజ్ ఎంచుకునే అవకాశం కూడా ఉండేది. ప్రభుత్వ సెలవు రోజుల్లో తప్ప అన్ని పనిదినాల్లో సేవలు కొనసాగించేవారు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సైతం పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలను అక్కడికే పంపించేవారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఎన్జీవోల ఆధ్వర్యంలో ఉచితంగా నాణ్యమైన ఆపరేషన్లు చేయించేవారు. ఇవే కాకుండా మల్టీ విటమిన్ మాత్రలు, చుక్కల మందు (ఐ–డ్రాప్స్)లు ఉచితంగా అందించేవారు. ఈ సేవలన్నిటినికీ కూటమి ప్రభుత్వం చాపచుట్టేసింది.
ఈ రెండు ఉదాహరణలు మాత్రమే.. కంటి సమస్యలకు సంబంధించి సీఎం ఈ– ఐ కేంద్రాలకు జిల్లా వ్యాప్తంగా రోజూ వెళ్తున్న వేలాది మందికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
ఆళ్లగడ్డ: కంటి సమస్యలతో బాధపడే పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు గత వైఎస్సార్పీ ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసింది. ఆధునిక యంత్రాలతో ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్ల జోడు సైతం అందజేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘వైఎస్సార్ కంటి వెలుగు’ను ఆపేశారు. సీహెచ్సీల్లోని ఈ–ఐ కేంద్రాల కాంట్రాక్ట్ గడువు ముగిసి 10 నెలలుగా సేవలు నిలిచి పోయినా పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 10 ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ – ఐ కేంద్రాలను మూసేశారు. దీంతో పేదలు కంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
గత ప్రభుత్వంలో పెద్దపీట
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. సీహెచ్సీల్లో ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాల నిర్వహణతో పాటు వృద్ధులు, వికలాంగులు, విద్యార్థుల కోసం గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్సార్ కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించారు. సేవలకు ఆటంకం కలుగకుండా కాంట్రాక్ట్ సంస్థతో ఎప్పటికప్పుడు ఎంఓయూ గడువు రెన్యువల్ చేస్తూ వచ్చారు. ఈ ఐ కేంద్రాలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మొత్తంగా 3.60 లక్షల మందికి రిఫ్రాక్షన్ చెక్స్, ఫండస్ చెక్స్, డీఆర్, గ్లకోమా, మాక్యులర్ డిజనరేషన్, కాటరాక్ట్, హైపర్టెన్సివ్ రెటినోపతి తదితర కంటి పరీక్షలు నిర్వహించింది. ఆయా రోగాలకు సంబంధిత వైద్యసేవలు, అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సుమారు 1,80,118 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 100 మందికి పైగా రోగులు చుట్టపక్కల గ్రామాల నుంచి వచ్చి కార్పోరేట్ కంటి వైద్యసేవలు ఉచితంగా పొందేవారు.
అత్యాధునిక పరికరాలు
ఈ–ఐ కేంద్రంలో అత్యాధునికమైన రూ. 8 లక్షల విలువ చేసే ఆటోరిఫ్లెక్షన్, రెటీన పరీక్షల యంత్రాలు, ఇతర పరికరాలతో కంటి రెటీన పరీక్షలు చేసేవారు. నివేదికలు అపోలో ఆసుపత్రి నిపుణులకు పంపించేవారు. వారి సూచనలు, సలహాలతో వైద్యం అందించేవారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా ముందుగానే గుర్తించడంతో పాటు నివారణ చర్యలను వైదయ నిపుణులు సూచించేవారు. 60 ఏళ్లలోపు వారందరికీ శుక్ల దృష్టి లోపం వంటి వివిధ కంటి వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసేవారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఖరీదైన పండఢస్ రెటినో పరీక్షలు చేసి ఫలితాలను ఆయా ఈ–ఐ కేంద్రాల్లో తెలియజేసేవారు. ప్రస్తుతం ఈ సేవలకు మంగళం పాడారు. ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలకు తాళాలు వేయడంతో వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయోమయంలో సిబ్బంది
ఈ–ఐ కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు కేంద్రానికి ఇద్దరిని చొప్పున జిల్లాలోని 10 కేంద్రాల్లో 20 మంది ప్రైవేటు ఏజెన్సీ ద్వార నియమించారు. అయితే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ–ఐ కేంద్రాలను మూసి వేయడంతో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఎక్విప్మెంట్ అసిస్టెంట్లు పరిస్థితి అయోమయంగా మారింది. ‘ఇంతకు మనం విధుల్లో ఉన్నామా లేక తొలగించారా’ అని వారికి వారే ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.
ఇదీ దుస్థితి
కంటి సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వచ్చే వారికి ఆధార్ కార్డు ఆధారంగా ఓపీ రాసేవారు. అందులో ఒక ఐడీని క్రియేట్ చేసి ఉచితంగా కంటి పరీక్షలు చేసేవారు. పరీక్షల ఆధారంగా అవసరమైన మందులు ఉచితంగా అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సేవలను నిలిపివేసింది. దీంతో ఇదే పరీక్షలు ప్రైవేటు వైద్యశాల్లో అయితే రూ. 10 నుంచి రూ. 20 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అదీ నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు తదితర పట్టణాల్లో ఉండే ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇంతటి ప్ర

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇంతటి ప్ర

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇంతటి ప్ర