
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(సెంట్రల్): అన్ని కోర్టుల్లో జూలై 5న జాతీయలోక్ అదాలత్ నిర్వహించాలని, అందులో ఎక్కువ కేసులు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మర్/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్లో జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్పై ఇన్సూరెన్స్, న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు, మునిసిపల్, భూసేకరణాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్ ఉన్న రాజీ కాదగిన కంపౌండబుల్ క్రిమినల్, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాదాలు, సివిల్, భూసేకరణ కేసులను త్వరగా పరిష్కరించేందుకు జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులను పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ అజయ్కుమార్, కర్నూలు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు.